జూరెల్ అద్భుత సెంచరీ.. 503/9 వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వికెట్‌కీపర్ బ్యాటర్ ధ్రువ్ జూరెల్ (115 నాటౌట్) అద్భుత సెంచరీతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117) కూడా శతకంతో మెరవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించిన సమయంలో జూరెల్ 95 పరుగులతో ఉన్నాడు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత ఆచితూచి బ్యాటింగ్ చేసిన అతడు.. అసిత్ ఫెర్నాండో బౌలింగ్‌లో బౌలర్ మీదుగా చక్కటి డ్రైవ్ ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం అనంతరం చేతిపై ఉన్న ‘జై...